మనవార్తలు ,పటాన్ చెరు:
గాలి కంటే తేలికెన ( లెటర్ దాన్ ఎయిర్ – ఎల్టీఏ ) వ్యవస్థలు స్థిరంగా ఉన్నప్పుడు కూడా ఎత్తులో ఉండగల సామర్థ్యం , తేలే శక్తి వంటి ప్రత్యేకతల కారణంగా ఏరోస్పేస్ సిస్టమ్స్ సముచిత స్థానాన్ని ఆక్రమించాయని ఐఐటీ బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రాజ్కుమార్ ఎస్.పంత్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ డిజెన్ అండ్ సెజింగ్ ఆఫ్ యాన్ ఇండోర్ ఎయిరిప్ ‘ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యశాల ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది . అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , ఏడాదిలోగా ఈ ప్రాంగణంలో ఎల్టీఏ వ్యవస్థను అభివృద్ధి చేసి , అమలులోకి తెస్తే ఈ వర్క్షాపు విజయవంతమైనట్టు భావిస్తానని ఆయన స్పష్టీకరించారు . ఎయిరిప్లు , ఏరోస్టాట్లు ఈ సాంకేతికత రెండు సూత్రాలని , ఇవి వేమానిక నిఘా , వెరైస్ కమ్యూనికేషన్ , ప్రోడక్ట్ ప్రమోషన్ వంటి అనేక పనుల కోసం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నట్టు ప్రొఫెసర్ పంత్ పేర్కొన్నారు .
ఎయిర్షిస్లు సుదూర ప్రాంతాలకు ప్రయాణీకుల రవాణా , సరకు రవాణాలను తక్కువ ఖర్చుతో చేయవచ్చని , వాటికి పొడవైన రన్వేలు అవసరం లేదని . చాలా తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయని ఆయన వివరించారు . ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలు వెళ్లే విద్యార్థులు స్కాలర్షిప్లు ఉంటేనే వెళ్లాలని ఆయన నొక్కిచెప్పారు . గీతం ప్రోగ్రామ్ డెరైక్టర్ ( రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ) ప్రొఫెసర్ కె.ఆర్.అనంత్ ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు . సెక్స్ట్స్ను అర్థం చేసుకోవడం చాలా సులువని , అయితే దానిని ఇంజనీరింగ్ గా మార్చడం సవాళ్లతో కూడుకున్నదని , అది వాణిజ్య కోణంలో చేయాలని చెప్పారు .
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య మాట్లాడుతూ , ప్రొఫెసర్ పంత్ వంటి వారి గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు . తొలుత , ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వి . హిమబిందు స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ సమన్వయకర్త ఎం.సత్యప్రసాద్ వందన సమర్పణ చేశారు . ఈ ప్రారంభోత్సవంలో ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . బుధవారం వరకు ఈ కార్యశాల కొనసాగనుంది .