ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్య సంవత్సరానికి బీబీఏ -1, హిస్టరీ -1 అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు బి బి ఏ, ఎంబీఏ మరియు హిస్టరీ కి సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ కలిగి 55 శాతం, మరియు ఎస్సీ ఎస్టీలకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలని, నెట్ సెట్ పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని, ఈనెల 21 తేదీన ఉదయం 11 గంటల నుండి రెండు గంటల వరకు ఇంటర్వ్యూలు పటాన్ చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంబంధిత పత్రాలతో కళాశాలలో నేరుగా హాజరై ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సూచించారు