మనవార్తలు ,మెదక్:
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చి వైయస్సార్ పేరు మార్చడం తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్ పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు ఇళ్లేందుల రమేష్ గారు తెలిపారు.ఎన్టీఆర్ గారి పేరు మార్చడం బాధాకరం, దీనిని తెలుగు ప్రజలు అంగీకరించరు. ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టాలన్న బిల్లు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిరంకుశ, తుగ్లక్ నిర్ణయాలతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఈ సందర్భంగా తెలిపారు. మీరు ఎన్ని చేసినా ఎన్టీఆర్ చరిత్రను మార్చలేరు.
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ ను విడదీయలేరు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన దుర్మార్గమైన చర్య, దీనిని తెలుగు ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తుగ్లక్ నిర్ణయాలతో మంట గలపలేరు. తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న ఎన్టీఆర్ పేరు మారుస్తారా? తెలుగు జాతికి ఇదొ దుర్ధినం. ఎన్టీఆర్ పేరు మార్చడా నికి ఎలా మనసు ఒప్పిందో జగన్ ప్రభుత్వం తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని తెలిపారు ఇప్పటికైనా ఎన్టీఆర్ పేరుతో ఏర్పడ్డ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని లేదంటే జగన్ ప్రభుత్వాన్నిప్రజలు అస్యహించుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…