సమానత్వం కోసం జాతిని జాగృతం చేసిన మహనీయుడు అంబేద్కర్_ నీలం మధు ముదిరాజ్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అంటరానితనాన్ని రూపుమాపి అన్ని వర్గాల సమానత్వం కోసం జాతిని జాగృతం చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఆయన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి ఆయన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించి, ప్రతి ఒక్కరికి సమానత్వం, సౌబ్రాతత్వం, రిజర్వేషన్లు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే తలంపు తో రాజ్యాంగాన్ని రూపొందించాడని తెలిపారు, సమాజంలో సామాజిక అసమానతలు రూపుమాపితేనే అభివృద్ధి పథంలో పయనిస్తామని నమ్మి ఆనాడే రాజ్యాంగంలో బడుగు వర్గాలకు ప్రాధాన్యతనిచ్చిన అంబేద్కర్ గారి ఆశయ సాధనకు నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *