పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాజకీయ నాయకులు బిల్డర్ల చేతిలో మోసపోయిన ఐలాపూర్ భాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించాలని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు .పేద మద్యతరగతి ప్రజలు అద్దె కట్టలేక అవగాహన లోపంతో అక్కడ ఇళ్ళు కొన్నారని అయితే అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిద్ర మత్తులో మునిగిపోయి కోర్టు ఆర్డర్ పేరిట అర్ధరాత్రి ఇండ్లు ఖాళీ చేయించి వారి మానవ హక్కులను హరించడం చాలా భాధాకరమని మెట్టు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు ఇండ్ల నిర్మాణ సమయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్లే భాధితులు రోడ్డున పడ్డారని ఇప్పటికైనా ప్రజలు ఇండ్లు స్థలాలు కొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వారిని మోసం చేసి స్థలాలు విక్రయించి సొమ్ము చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు.