పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ విముక్తి కోసం, నిజాం కార్యకలాపాలకు వ్యతిరేకంగా తనదైన శైలిలో పోరాడిన పోరాట యోధుడు కొమురం భీమ్ అని మెదక్ పార్లమెంటు కంటెస్టేడ్ కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.కొమురం భీం జయంతి సందర్భంగా చిట్కుల్ లోని క్యాంపు కార్యాలయంలో కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ,దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వారితో విరోచితంగా పోరాడినటువంటి పోరాట యోధుడు కొమరం భీమ్ అన్నారు.ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి అణగారిన వర్గాలకు ఆత్మబంధువుగా మారాడని తెలిపారు.అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలపై నిజాం సర్కార్ పాశవిక చర్యలకు పాల్పడిన సందర్భంలో ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో నిజాం సర్కారుపై భీకరంగా పోరాడి వీర మరణం పొంది ఆదివాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని కొనియాడారు.ఆ మహావీరుడు పోరాట స్ఫూర్తిని నేటి తరం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వి నారాయణరెడ్డి,మురళీ,గోపాల్,ఉళ్ళ శంకర్,మన్నేరాఘవేంద్ర, కంజార్ల రవి,విష్ణువర్థన్, ప్యట గోపాల్,సోములు,మల్లేశం,మనోహర్,మణికంఠ,తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…