అందమైన గోల్డ్ డైమండ్స్ నిధులతో కనువిందు చేసిన సినీనటి నిధి అగర్వాల్
మనవార్తలు ,హైదరాబాద్:
తనకు గోల్డ్ డైమండ్స్ అంటే ఎంతో ఇష్టమని సినీనటి నిధి అగర్వాల్ అన్నారు. చందానగర్ లో సిబిఐ గోల్డ్ డైమండ్స్ అండ్ శుభశ్రీ సిల్క్ షో రూమ్ ను ఆమె ప్రారంభించారు.అనంతరం నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఇక్కడ లభించే సరికొత్త డిజైనర్లు వెరైటీలు సారీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయని, నాకు శారీస్ అంటే చాల ఇష్టమని అని ,నాకు పట్టు శారీస్ అంటే చాల ఇష్టమని తెలిపారు .పవన్ కళ్యాణ్ తో హరి హర మల్లు మూవీ చేయడం చాల సంతోషంగా ఉందని తెలిపారు .గోల్డ్ అండ్ డైమండ్స్ తో పాటు శుభశ్రీ సిల్క్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషకరమని తెలిపారు.ప్రజలందరికి బతుకమ్మ ,దసరా ,దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
షోరూం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జానా సురేష్ గారు మాట్లాడుతూ సిబిజె గోల్డ్ డైమండ్స్ మరియు శుభశ్రీ సిల్క్ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలుస్తుండడం తమకు ఎంతో ఉత్సాహాన్ని, మరిన్ని ప్రదేశాలలో ప్రారంభించాలనే ప్రోత్సాహాన్ని అందిస్తుందని, ఇక్కడి ప్రజల అభిరుచికి సరిపడే బంగారు ఆభరణాలు ఎంపిక చేయడంలోగాని ప్రత్యేక శ్రద్ధ పెట్టడంవలన ఇక్కడి కస్టమర్ల అభిమానాన్ని మరింత వేగంగా పొందుతామనడంలో తమకు అపారమైన నమ్మకంమందని తెలియజేసారు. ప్రారంభోత్సవ మరియు దసరా దీపావళి వేడుకల సందర్భంగా బంగారు ఆభరణాలపై మజూరీ లేదు, తరుగులో 26% తగ్గింపు మరియు డైమండ్ క్యారెట్ పై రూ.10,000తగ్గింపు, సిల్వర్ ఆర్టికల్స్ పై మజూరీ మరియు తరుగు లేదు ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకొమ్మని అన్నారు.