జర్నలిస్టు సమస్యలను పరిష్కరించే విధంగా ఏబీజే ఎఫ్ కృషి

Districts politics Telangana

అమీన్ పూర్ లో ఏ.బీ.జే.ఎఫ్ సంగారెడ్డి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం

మనవార్తలు , అమీన్ పూర్:

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున హిల్స్ లో అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లా కు సంబంధించిన కార్యవర్గ సమావేశాన్ని ఏ. బీ. జే .ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వీ సురేష్ కుమార్( V10 tv ) ఛైర్మెన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జర్నలిస్టులు సమావేశమయ్యారు.

దీనికి అధ్యక్షత వ్యవహరించిన సురేష్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లే విధింగా ప్రతి ఒక్క జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించే విధంగా ఏ బీ జే ఎఫ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని ఏ. బీ. జే .ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వీ సురేష్ కుమార్( V10 tv ) ఛైర్మెన్ తెలిపారు .రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ. బీ. జే .ఎఫ్ ను విస్తరింపాజేయాలని సభ్యులందరికి సూచించారు .అనంతరం సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు .

ఈ సమావేశంలో ఏ బీ జే ఎఫ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కొమ్ముగురీ ప్రదీప్ , సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సునిల్ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ సంస్థను జర్నలిస్టుల ఐక్యత తో బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగరెడ్డి జిల్లా సెక్రెటరీ అఖిల్ , హరి ప్రసాద్, రవి , హరి, అనిల్, మనీష్, భారత్, సాయి కిరణ్, రఘు నాయక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *