అగ్నికి ఆహుతైన పోలీస్ శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం

Crime Districts politics Telangana

మనవార్తలు ,నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం పెట్రో కార్ అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. నగరంలోని ఫస్ట్ టౌన్ పోలిస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ మొబైల్ కార్‌కు నగరంలో దర్నా చౌక్‌లో మంటలు అంటుకుని కాలిపోయింది. అప్పుడు దానిని హెడ్ కానిస్టేబుల్ పర్వేజ్ నడుపుతుండగా, మహిళ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజీవ రావు అందులో ఉన్నారు. కారు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అగ్నికిలలకు కారు మొత్తం కాలిపోయింది. పైరింజన్ వచ్చి మంటలను ఆర్పిన అది పూర్తిగా దగ్ధం అయింది. కారులో ముందుగా పొగలు రావడంతో పోలిస్‌లు దానిని దిగి పోవడంతో ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతోనే కారు తగలబడిపోయిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *