Districts

పంజాబ్ కి ఒక న్యాయం.. తెలంగాణకి ఒక న్యాయమా..రైతన్నకు అండగా గులాబీ దండు

నియోజకవర్గ స్థాయి రైతు మహాధర్నాలో ఎమ్మెల్యే జిఎంఆర్ 

గుమ్మడిదల

తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు నిరంతర పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమం లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహా ధర్నా ను మండల కేంద్రమైన గుమ్మడిదల లో నిర్వహించారు. ఈ సమావేశానికి అతిథిగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని ఖరాఖండీగా చెప్పడం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని చెప్పడం అంటే పరోక్షంగా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చేయవద్దని సూచించడమే అన్నారు. ఒకవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వడ్లు కొనమని చెప్తుంటే మరోవైపు స్థానిక బిజెపి నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దేశానికి అన్నపూర్ణ గా నిలిచిన తెలంగాణా పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పుల మూలంగా 64 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా.. కేంద్ర రాష్ట్ర లకు చెందిన బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఇంత సాగవుతుందా అంటూ ఎద్దేవా చేయడం రైతులను అవమానించడమే అన్నారు.

 

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago