Districts

పంజాబ్ కి ఒక న్యాయం.. తెలంగాణకి ఒక న్యాయమా..రైతన్నకు అండగా గులాబీ దండు

నియోజకవర్గ స్థాయి రైతు మహాధర్నాలో ఎమ్మెల్యే జిఎంఆర్ 

గుమ్మడిదల

తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు నిరంతర పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమం లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహా ధర్నా ను మండల కేంద్రమైన గుమ్మడిదల లో నిర్వహించారు. ఈ సమావేశానికి అతిథిగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని ఖరాఖండీగా చెప్పడం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని చెప్పడం అంటే పరోక్షంగా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చేయవద్దని సూచించడమే అన్నారు. ఒకవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వడ్లు కొనమని చెప్తుంటే మరోవైపు స్థానిక బిజెపి నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దేశానికి అన్నపూర్ణ గా నిలిచిన తెలంగాణా పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పుల మూలంగా 64 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా.. కేంద్ర రాష్ట్ర లకు చెందిన బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఇంత సాగవుతుందా అంటూ ఎద్దేవా చేయడం రైతులను అవమానించడమే అన్నారు.

 

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

14 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

15 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago