6 లక్షల 56 వేలు పలికిన గణేశు లడ్డు

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు మండల పరిధిలోని ఐనోల్ గ్రామం లోని మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సోమవారం సాయంత్రం గణేష్ మండపం వద్ద జరిగిన లడ్డు ప్రసాదం పాట పోటాపోటీగా సాగిన వేలంలో అదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, ప్రసన్న రూ.6 లక్షల 56 వేల కు లడ్డూను పాటలో దక్కించుకున్నారు. లడ్డును దక్కించుకున్న వారిని యూత్ సభ్యులు సన్మానించి ,లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి, హర్షవర్ధన్, మధు, శ్రీకాంత్ మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *