శేరిలింగంపల్లి
అవార్డులు భాద్యత ను పెంచుతాయి – కృష్ణ మూర్తి చారి
శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కరోనా కాలంలో కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సేవలను గుర్తించి హైదరాబాద్ – రవీంద్ర భారతి లో జరిగిన మయూరి ఆర్ట్స్ విశ్వకళా నంది పురస్కారాలు 2021 ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తిస్తూ కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి కి కేంద్ర అధికార ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తి అందిస్తుందని ఫౌండేషన్ పై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తూ ముఖ్యంగా గత 9 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో నిర్వర్తిస్తామని సేవలో వుండే మానసిక పునరుత్తేజానికి నాంది పలుకుతూ కార్యక్రమాలు వుంటాయని తెలియచేశారు. మయూరి ఆర్ట్స్ చైర్ పర్సన్ మయూరి రాధ కు ధన్యవాదాలు తెలిపారు.