4.20 లక్షలు పలికిన వినాయకుడి లడ్డు 

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పోచారం గ్రామంలో శ్రీ రామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవ గణనాథునీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయకుడి నిమజ్జనం రోజు అయిన మంగళవారం రాత్రి జరిగిన గణనాథునీ మహా ప్రసాదం వేలం పాటలో నాలుగున్నర లక్షలకు గ్రామానికి చెందిన తలారి నగేష్ లడ్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ ఆ గణపయ్య కటాక్షం వల్ల గ్రామములోను ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. వేలంపాటలో లడ్డును దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *