– కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి
– అంత్యక్రియలకు తక్షణ సాయం
బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
బొల్లారం పారిశ్రామిక వాడలో నివసించే కడారు కిషన్ (38 సం”) ఎక్సల్ రబ్బర్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేసేవాడు. పరిశ్రమ పనుల నిమిత్తం బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి మరియు మున్సిపల్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి పరిశ్రమ యజమాని రఘునాధ్ రెడ్డి తో చర్చించి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పరిశ్రమ నుంచి మృతుడి కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం అందించేందుకు యజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా అంత్యక్రియల నిమిత్తం తక్షణసాయం అందజేస్తామన్నారు. కష్టకాలంలో కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన నాయకులకు, పరిశ్రమ యజమాన్యానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోప్షన్ మెంబర్ మునీర్ , స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి , చంద్రారెడ్డి , శంకర్ , శ్రీనివాస్ , యువజన నాయకులు బషీర్ , అంజి , ఆంజనేయులు, బాధిత కుటుంబ సభ్యులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…