కార్మికుడి కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం

politics Telangana

– కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి

– అంత్యక్రియలకు తక్షణ సాయం

బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :

బొల్లారం పారిశ్రామిక వాడలో నివసించే కడారు కిషన్ (38 సం”) ఎక్సల్ రబ్బర్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేసేవాడు. పరిశ్రమ పనుల నిమిత్తం బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి మరియు మున్సిపల్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి  పరిశ్రమ యజమాని రఘునాధ్ రెడ్డి తో చర్చించి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పరిశ్రమ నుంచి మృతుడి కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం అందించేందుకు యజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా అంత్యక్రియల నిమిత్తం తక్షణసాయం అందజేస్తామన్నారు. కష్టకాలంలో కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన నాయకులకు, పరిశ్రమ యజమాన్యానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోప్షన్ మెంబర్ మునీర్ , స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి , చంద్రారెడ్డి , శంకర్ , శ్రీనివాస్ , యువజన నాయకులు బషీర్ , అంజి , ఆంజనేయులు, బాధిత కుటుంబ సభ్యులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *