శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 21 వ అవార్డ్

Hyderabad politics Telangana

రామచంద్రపురం:

శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 21 వ అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉందని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు. కరోనా కష్టకాలంలో , లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తించి అవార్డులను అందుకోవడం తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు.ఆదివారం కింగ్ కోటి లోని తెలంగాణ తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో  ముఖ్య అతిథిగా కేంద్ర అధికార ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి గారి చేతుల మీదుగా నంది అవార్డును అందజేశారు ముందు రోజుల్లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో నిర్వర్తిస్తామని సేవలో వుండే మానసిక పునరుత్తేజానికి నాంది పలుకుతూ కార్యక్రమాలు వుంటాయని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం తెలిపారు

 

అలాగే . ఆర్ కే కళ సంస్కృతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రంజిత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని ,లాక్ డౌన్ సమయంలో అర్థకలితో బాధపడుతున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీ బాలాజీ ఫౌండేషన్ కు మొదటి నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించినటువంటి ఆత్మీయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు .రాబోయే రోజుల్లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో నిర్వర్తిస్తామన్నారు. సామాజిక సేవలో తమ వంతు సాయంగా అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు .తాను పుట్టి పెరిగిన రామచంద్రపురం పట్టణ ప్రజలకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు బలరాం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *