నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

అర్హులందరికీ రేషన్ కార్డులు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అర్హతలున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని, నూతన రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలు, డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే […]

Continue Reading

విలువలతో కూడిన బాధ్యతాయుత పౌరులుగా ఎదగండి

సార్వత్రిక మానవ విలువలపై గీతంలో స్ఫూర్తిదాయక ప్రసంగం చేసిన గౌతమ్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులు విలువలకు పెద్దపీట వేసి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సీఐఐ తెలంగాణ ఉపాధ్యక్షుడు, రీ-సస్టైనబిలిటీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎం. గౌతమ్ రెడ్డి హితబోధ చేశారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని తొలి ఏడాది బీటెక్ విద్యార్థులను ఉద్దేశించిన మంగళవారం ఆయన సార్వత్రిక మానవ విలువలపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.మానవ విలువల యొక్క నాలుగు ప్రధాన స్తంభాలు- […]

Continue Reading

గీతం విద్యార్థినికి ప్రతిష్టాత్మక ఐవీఐ బ్రియాన్ హోల్డెన్ యంగ్ ఆప్టోమెట్రీ రీసెర్చర్ రోలింగ్ ట్రోఫీ

ఆప్టోమెట్రీ రంగంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి గుర్తింపు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు వర్ధమాన పరిశోధకురాలు జంగపల్లి వర్ష, ఆప్టోమెట్రీ రంగంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ గుర్తింపు అయిన ఐవీఐ బ్రియాన్ హోల్డెన్ యంగ్ ఆప్టోమెట్రీ రీసెర్చర్ రోలింగ్ ట్రోఫీని అందుకున్నారు. ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్.వీ. ప్రసాద్ నైత్ర వైద్యశాల (ఎల్వీపీఈఐ) సహకారంతో గీతం ఆప్టోమెట్రీ కోర్సును నిర్వహిస్తున్న విషయం విదితమే. భారతదేశంలో కంటి సంరక్షణను అభివృద్ధి చేయడంపై దృష్టి […]

Continue Reading

ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దార్శనికుడు, దేశంలో సమసమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం పటాన్‌చెరు పట్టణంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలందరూ బాపూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు జగ్జీవన్ […]

Continue Reading

సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి సిగాచి పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి ఇస్నాపూర్లో ప్రభుత్వ ట్రామా కేర్ ఏర్పాటు చేయండి అసంఘటితరంగ కార్మికులకు ప్రమాద బీమా కల్పించండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సిగాచి పరిశ్రమ దుర్ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమలలో పనిచేస్తున్న అసంఘటితరంగ కార్మికులకు 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ […]

Continue Reading

ప్రతి పరిశ్రమను నిరంతరం తనిఖీ చేయాలి నవభారత్ నిర్మాన్ యువసేన అద్యక్షుడు మెట్టుశ్రీధర్

భవిషత్ లో ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నవభారత్ నిర్మాణ్ యువసేన అద్యక్షుడు మెట్టుశ్రీధర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మినీ ఇండియాగా పేరుపొందిన పటాన్‌చెరు పారిశ్రామిక వాడా అయినటువంటి పాశామైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించడం చాలా బాధాకరం అని నవభారత్ నిర్మాణ్ యువసేన అద్యక్షుడు మెట్టుశ్రీధర్ అన్నారు.యాజమాన్యం నిర్లక్ష్యం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి పరిశ్రమ ఘటన చోటు […]

Continue Reading

ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

సెట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరుపించాలి తక్షణం మృతులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి పరిశ్రమల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలి ప్రమాదంలో శాశ్వత వైకల్యం కల్గిన వారికి 50 లక్షలు , గాయపడ్డ వారికి 10లక్షల పరిహారం చెల్లించాలి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శ జాన్ వెస్లీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసి వెంటనే ఇక్కడికి రప్పించాలని,ఈ దుర్ఘటనపై […]

Continue Reading

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో సీహెచ్.భార్గవికి పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పార్కిన్సన్స్ డ్రగ్ డెలివరీలో సంచలనాత్మక పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని చెక్కిళ్ల భార్గవిని డాక్టరేట్ వరించింది. నాసిక లోపల పంపిణీ కోసం సూక్ష్మవాహకాల మోతాదు సూత్రీకరణ, మూల్యాంకనంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రఘువీర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలకమైన […]

Continue Reading