మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో

భారత్‌లోనే అరుదైన రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడ్ సర్జరీ విజయవంతం మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : భారతదేశం అడ్వాన్స్‌డ్ సర్జరీలలో ప్రపంచ స్థాయి కేంద్రంగా మారుతోందని నిరూపిస్తూ, మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఒక గొప్ప విజయాన్ని సాధించిందనీ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడెక్టమీ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందనీ తెలిపారు.ఇది మెడికవర్ గ్రూప్ చరిత్రలోనే భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా […]

Continue Reading

మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగంగా

గీతంలో మొక్కలు నాటిన డీఎస్పీ, సీఐ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పర్యావరణ స్పృహను పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల దుర్వినియోగ ప్రమాదాల గురించి అవగాహన పెంచడంలో భాగంగా పటాన్ చెరు పోలీసు విభాగం సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు.డీఎస్పీ ఎస్. ప్రభాకర్, పటాన్ చెరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ వినాయకరెడ్డిల నేతృత్వంలో, దాదాపు 30 మంది పోలీసు సిబ్బంది గీతం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని సూచిస్తూ […]

Continue Reading

సొంత ఇల్లు ఓ కల.. సాకారం చెద్దామిలా

వాల్యూయర్స్ సదస్సులో హైడ్రా కమిషనర్ సూచనలు మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : అందరికీ సొంత ఇల్లు ఓ కల. అని, దానిని సాకారం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమైoదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్గారు అన్నారు.  ఇల్లు కొనేందుకు రుణాలిచ్చే ముందు అన్ని విధాలా సరి చూసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ వాల్యూయర్స్ రిజిస్టర్డ్ వాల్యూయర్స్ ఫౌండేషన్, హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో  ట్రాన్స్ఫార్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్” అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా […]

Continue Reading

పటాన్‌చెరులో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

హాజరైన వేలాదిమంది విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు రెండు గంటల పాటు నిర్విరామంగా యోగా విన్యాసాలు. యోగా విశిష్టతను తెలిపేలా యోగా భంగిమలు. యోగా దినచర్యలో భాగం కావాలి ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా సువర్ణ అవకాశం పటాన్‌చెరు చరిత్రలోనే అతిపెద్ద యోగా డే వేడుకలు సమాజం నుండి డ్రగ్స్ ను వెలివేయాలి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు […]

Continue Reading

గీతంలో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

చురుకుగా పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ‘ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం’ ఇతివృత్తంలో స్పోర్ట్స్ డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా సమగ్ర శ్రేయస్సు, పర్యావరణ స్పృహను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ వేడుక సాగింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగాభ్యాసాల ప్రాముఖ్యతను […]

Continue Reading

రసాయన శాస్త్రంలో జ్యోత్స్న మెండాకు పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని జ్యోత్న్స మెండా డాక్టరేట్ కు అర్హత సాధించారు. యూపీఎల్సీలో డిజైన్ విధానం ద్వారా నాణ్యత యొక్క వినియోగం, ఎంచుకున్న మోతాదు రూపాలు, వాటి స్థిరత్వం కోసం విశ్లేషణాత్మక పద్ధతి అభివృద్ధి, ధ్రువీకరణపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ […]

Continue Reading

జూన్ 21న పటాన్చెరులో అంతర్జాతీయ యోగా దినోత్సవం

మైత్రి మైదానంలో భారీ ఏర్పాట్లు  భారీ సంఖ్యలో హాజరుకానున్న విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు, అధికారులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 21వ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుండి 9 గంటల వరకు పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో భారీ స్థాయిలో యోగా దినోత్సవం వేడుకలు ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో.వివిధ శాఖల అధికారులు, యోగ […]

Continue Reading

ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో గీతం ప్రాతినిధ్యం

-లండన్ సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొని, ప్రసంగించిన ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ -పరిశోధనా పత్రాన్ని సమర్పించి అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలందుకున్న గీతం విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులోని సీఎస్ఈ విభాగం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ ఇటీవల లండన్ లో నిర్వహించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) సదస్సులో విశిష్ట అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. ఈ విషయాన్ని గీతం వర్గాలు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో […]

Continue Reading

మంత్రి వాకిటి శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసిన మియాపూర్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు మరియు యువజన శాఖల నూతన మంత్రి వాకిటి శ్రీహరి ని మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ని శాలువాతో ఘనంగా సత్కరించి, సౌహార్దపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, యువతకి రాజకీయ అవకాశాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా యలమంచి ఉదయ్ కిరణ్ […]

Continue Reading

కృష్ణ మూర్తి చారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : అందరికి ఆరోగ్యం బాగుండాలనే సదుద్దేశం తోకంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్, బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొల్లూరులో కేర్ ఆండ్ క్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్ మరియు అందరికీ భోజన సదుపాయాలు కల్పించినట్లు కృష్ణ మూర్తి చారి తెలిపాడు. అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సునంద కృష్ణమూర్తి, శ్రీనివాస్, సాయివెంకట హర్ష, […]

Continue Reading