కులగణన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న మియాపూర్ డివిజన్ నాయకులు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : బీసీ రిజర్వేషన్‌లో తెలంగాణ దేశానికే ఆదర్శం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం, సువర్ణాక్షరాలతో లిఖించాల్సినరోజుఅని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాల మధ్య శేరిలింగంపల్లినియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ తో మియాపూర్ డివిజన్ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా కుల గణన నిర్వహించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జెనరల్ […]

Continue Reading

24న పటాన్చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందు ఆహ్వాన […]

Continue Reading

చట్టసభల్లో బిల్లుల ఆమోదం చారిత్రాత్మక విజయం – మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి

-పార్టీ శ్రేణులతో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం మనవార్తలు ,బొల్లారం: రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించడం చారిత్రాత్మకమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, బొల్లారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్  పిలుపుమేరకు బొల్లారం మున్సిపాలిటీలోని జ్యోతి థియేటర్ ముందు […]

Continue Reading

లక్ష రూపాయల ఎల్ఓసి అందచేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ కి చెందిన సన్నీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన లక్ష రూపాయల విలువైన ఎల్ఓసి నీ సన్నీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న స్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్ ధనీష్ అబ్దుల్ ఖాదర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పరిశ్రమకు అవసరాలకు తగ్గట్టు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలను అలవరచుకుంటే, ఆ రంగంలోనే లెక్కకు మిక్కిలిగా ఉపాధి అవకాశాలున్నాయని బెంగళూరులోని ఎస్ఎస్ టెక్నాలజీస్ స్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్ ధనీష్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఏరోనాటిక్స్, స్పేస్, డిఫెన్స్ లో విజయవంతంమైన కెరీర్ కోసం డిజైన్ ఇన్నోవేషన్’ అనే […]

Continue Reading

బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు చారిత్రాత్మకం- నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని ,ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో టీపీసీసీ పిలుపుమేరకు అసెంబ్లీ లో బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఏఐసీసీ అగ్రనేతలు,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ల […]

Continue Reading

క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలోని వివిధ చర్చిలకు మంజూరు చేసిన ఐదు లక్షల రూపాయల విలువైన చెక్కులను బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చి ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనివార్య కారణాల మూలంగా చెక్కుల పంపిణీ ఆలస్యం జరిగిందని […]

Continue Reading

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి పరీక్షల సందర్బంగా ప్రతి సంవత్సరం లాగానే విద్యార్థులకు కొమిరిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో లో ఎగ్జామ్ పాడ్, పెన్, పెన్సిల్, జియోమెట్రీ బాక్స్, స్కేల్ లను గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా […]

Continue Reading

ఘనంగా గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ కు చెందిన బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రవికుమార్ యాదవ్ శాలువా కప్పి, కేక్ కట్ చేసి గణేష్ ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందు ముందు మరెన్నో వేడుకలు జరుపుకొని జీవితంలో, రాజకీయాల్లో పైకి రావాలని రవికుమార్ యాదవ్ ఆకాంక్షించారు. […]

Continue Reading

క్రమశిక్షణ, పట్టుదలను ఎన్ సీసీ పెంపొందిస్తుంది

వీడ్కోలు సమావేశంలో జూనియర్లకు ‘సీ’ సర్టిఫికెట్ గ్రహీతల ఉద్బోధ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్ సీసీ) అంటే కేవలం శిబిరాలు, పతకాల కంటే ఎక్కువని, ఇది క్రమశిక్షణ, పట్టుదల, గౌరవం యొక్క విలువలను పెంపొందిస్తుందని ‘సీ’ సర్టిఫికెట్ గ్రహీతలైన సీనియర్లు అభిప్రాయపడ్డారు. మూడేళ్ల ఎన్ సీసీ శిక్షణ పూర్తిచేసుకుని, ‘సీ’ సర్టిఫికెట్లు సాధించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విద్యార్థులకు జూనియర్లు బుధవారం చిరస్మరణీయమైన వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ల […]

Continue Reading