ఏప్రిల్ 9న ఉగాది

_పటాన్చెరువు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలుగు ప్రజల నూతన సంవత్సరానికి మొదటి పండుగ ఉగాది పర్వదినాన్ని ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించుకోవాలని పటాన్చెరు పట్టణంలోని పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. సోమవారం పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరయ్యారు. […]

Continue Reading

సి ఆర్ పి ఎఫ్ వాళ్ళు చేస్తున్న నిర్మాణాలు ఆపాలని ఆర్ డి ఓ కు పిర్యాదు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : మియాపూర్ నడిగడ్డ తండా సమీపంలో గల సి ఆర్ పి ఎఫ్ వారు నిర్మిస్తున్న కట్టడాలను ఆపాలని రాజేంద్రనగర్ ఆర్ డి ఓ కు నడిగడ్డ తాండ వాసులు వినీతిపత్రం అందించారు. బస్తిలో నిరుపేదలకు కనీసo చిన్న చిన్న మరమ్మతులే కాకుండ ప్రభుత్వం ద్వారా మంజూరైనా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీరు పైపు లైన్, విద్యుత్ ట్రాన్స్ ఫారం వంటి కనీస మౌలిక వసతులను కూడా నిరాకరించే సి ఆర్ […]

Continue Reading

పాలనా పునాదులను గుర్తెరగాలి

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ప్రొఫెసర్ మైఖేల్ సి. విలియమ్స్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలనేది అందరికీ తెలిసుండాలని, పాలనా పునాదులను గుర్తెరగాలని ప్రొఫెసర్ మైఖేల్ సి.విలియమ్స్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ ఎస్ )లోని పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ది జ్యామెట్రీ ఆఫ్ జస్టిస్: యాన్ ఒడస్సీ ఇన్ ఫ్రాక్టల్ పాలిటిక్స్’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. […]

Continue Reading

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి

_మహిళా దినోత్సవంలో సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ విష్ణుప్రియ సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సమాజహితం కోరి చేసే ఏ పనినైన , మరొకరి సాయం కోసం ఎదురు చూడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధించాలని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం. ఆర్. విష్ణుప్రియ సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ మహిళా దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉమెన్ లీడర్స్ ఫోరమ్, ఈ-క్లబ్, జీ-స్టూడియో, స్టూడెంట్ […]

Continue Reading

గీతమ్ కు సీఐఐ మెగా ప్లాంటేషన్ అవార్డు

  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతిష్ఠాత్మక ‘సీఐఐ మెగా ప్లాంటేషన్ అవార్డు’తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ను సత్కరించింది. సీఐఐ తెలంగాణ రాష్ట్ర వార్షిక సమావేశం- 2023-24, సుస్థిర తెలంగాణ నిర్మాణంపై సదస్సు సందర్భంగా ఈ ఆవార్డును ప్రదానం చేయగా, గీతం రెసిడెంట్డీ డైరక్టర్ వీవీఎస్ఆర్ వర్మ ఈ అవార్డును అందుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.గీతం ప్రాంగణంలో గత ఏడాది సుమారుగా ఎనిమిది వేల […]

Continue Reading

మహిళలు ధైర్యంగా ఉన్నప్పుడే లక్ష్యాన్ని సాధిస్తారు _- విశ్వ భారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని

– కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహిళలు ధైర్యంగా ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించ గలరని విశ్వభారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని అన్నారు.గురువారం పటాన్‌చెరు మండల పరిధిలోని ముత్తంగి విశ్వభారతి లా కళాశాల లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భవాని మాట్లాడుతూ… ఇంటికి ఇల్లాలే దీపం అనేది పాత మాటని… నేడు కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదున్నుగా ఉండటమే కాకుండా ఆకాశమే తమవసం కావాలనట్లుగా మహిళలు […]

Continue Reading

పెన్నార్ లో బి ఆర్ టి యు జయకేతనం

_వరుసగా రెండోసారి ఘన విజయం _విశ్వసనీయతకు మారుపేరు ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వం _కలిసి పోటీ చేసిన సిఐటియు, ఐ ఎన్ టి యు సి కూటమికి తప్పని ఓటమి _59 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పెన్నార్ పరిశ్రమలో నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బిఆర్టియు జయకేతనం ఎగరవేసింది. వరుసగా రెండుసార్లు గెలిచి కార్మికుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. బుధవారం పరిశ్రమలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో.. మొత్తం 508 ఓట్లకు గాను […]

Continue Reading

కౌటిల్యాలోని మౌలిక సదుపాయాలు అద్భుతం

_ప్రశంసించిన జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్ మాన్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్పీపీ)లోని మౌలిక సదుపాయాలు, ఇతరత్రా వనరులు, పర్యావరణం అంతా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉన్నాయని, ఇక్కడ విద్యనభ్యసించే వారంతా తమ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్ మాన్ సూచించారు. కేఎస్ పీపీ విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. గతంలో (2010కి పూర్వం) తాను ఇండియాలోని జర్మనీ […]

Continue Reading

పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బిఆర్టియుని బలపరచండి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కార్మికుల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్న బి.ఆర్.టి.యు కార్మిక సంఘాన్ని బలపరిచి, మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెన్నార్ పరిశ్రమ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ నెల 6వ తేదీన పెన్నార్ పరిశ్రమంలో జరగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో గల పెన్నార్ పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఎమ్మెల్యే […]

Continue Reading

మానసిక ఆరోగ్యం అవశ్యం: వెభైవి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యం ఆవశ్యమని, దాని గురించి నిరంతరం చర్చించాలని వెభైవి, న్యాయవాది స్పష్టీకరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హై దరాబాద్ లోని స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘బ్రేవ్ టుగెదర్’ (ధైర్యంగా కలిసి ఉండడం) అనే అంశంపై మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొబ్ ల్ లైన్ -న్యూయార్క్ ‘యువా’ల సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, మానసిక ఆరోగ్య అవగాహన ఆవశ్యకతను […]

Continue Reading