శ్రీవారి సేవలో క్రికెటర్ రాబిన్ ఉతప్ప..

మనవార్తలు ,తిరుమల : తిరుమల శ్రీవారిని క్రికెటర్ రాబిన్ ఉతప్ప దర్శించుకున్నారు.శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రాబిన్ ఉతప్ప స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. ఆలయ బయటకు వచ్చిన రాబిన్ ఉతప్పను చూసిన అభిమానులు పోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

Continue Reading

చేనేతకళాకారుల నైపుణ్యం గొప్పదని, చేనేతపరిశ్రమను ప్రోత్సహించాలి _తెలంగాణా స్టేట్ పోలీస్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జి. వైజయంతి

మనవార్తలు ,హైదరాబాద్: చేనేతకళాకారుల నైపుణ్యం గొప్పదని, చేనేతపరిశ్రమను ప్రోత్సహించాల్సిన భాద్యత అందరిపై ఉందని తెలంగాణా స్టేట్ పోలీస్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జి. వైజయంతి అన్నారు. శుక్రవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఆద్వర్యంలో శారీస్ ఆఫ్ ఇండియా ఫ్యాషన్ పేరిట శ్రావణమాస వెడ్డింగ్ స్పెషల్ ప్యాషన్ షోను ఏర్పాటుచేశారు. ఈనెల 8 నుండి 16వరకూ నిర్వహించబోతున్న ఎగ్జిబిషన్కు సంబంధించి దేశంలోని ప్రముఖ నగరాలను చెందిన చేనేతకళాకారుల చీరలను మోడల్స్ ధరించి ప్రదర్శించారు. ఈ […]

Continue Reading

కోటి 40 లక్షల రూపాయల నిధులతో అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

_ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా గణేష్ గడ్డ సిద్ది వినాయక దేవాలయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఒక కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శనివారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. […]

Continue Reading