నందిగామలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు: నిరుపేదలకు అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదిక సమీపంలో కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు గురువారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సహకారం […]

Continue Reading

పటాన్ చెరు నుండి లడక్ వరకు సైకిల్ యాత్ర చేసిన వెంకటేష్ ను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: ఇటీవల పటాన్ చెరు పట్టణం నుండి లడక్ వరకు 2600 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ పైన సాహస యాత్ర ద్వారా చేరుకున్న పటాన్ చెరు పట్టణానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడిని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేష్ ని ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా పూలమాలలతో సత్కరించారు.యాత్ర విశేషాలను, యాత్రలో ఎదుర్కొన్న అనుభవాలను వెంకటేష్ ను అడిగి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబం […]

Continue Reading

తల్లి ప్రేమ లేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య

_సూసైడ్ నోట్ లో స్పష్టంగా తెలిపిన అన్నదమ్ములు యాదిరెడ్డి , మహిపాల్ రెడ్డి లు మనవార్తలు ,మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం , అమ్మ ప్రేమ లేదని తమ చావుకు ఎవరు కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి 34 సం”లు, మహిపాల్ రెడ్డి 29 సం”లు రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి అతని తమ్ముడు మహిపాల్ రెడ్డి లు గత 9 నెలల క్రితం […]

Continue Reading

పటాన్ చెరు అమీన్పూర్ ఆర్యవైశ్య మహాసభ మండల కార్యవర్గ ఎన్నిక

మనవార్తలు ,పటాన్ చెరు: ఆర్యవైశ్యలు ప్రతి ఒక్క రంగాలలో ఎదగాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ తోపాజి అనంత కృష్ణ అన్నారు పటాన్ చెరు వాసవీ భవన్ లో జరిగిన ఆర్య వైశ్య కులస్థుల కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై పటాన్ చెరుమండలం మరియు అమీన్పూర్ మండలం ఆర్యవైశ్య మహాసభ ఎన్నికైన కార్యవర్గ మండలితో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం వారికి శాలువా కప్పి ప్రశంస పత్రాన్ని అందజేశారు ,ఈ సందర్భంగా శ్రీ తోపాజి […]

Continue Reading

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_పటాన్ చెరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలు […]

Continue Reading

మానసిక ప్రశాంతతో పాటు మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది _శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు బలరాం

మనవార్తలు ,రామచంద్రపురం మానసిక ఆధ్యాత్మిక కల్పించడమే ముఖ్య ఉద్దేశం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది అని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు బలరాం అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం లోని తన నివాసంలో వివిధ రకాల యెగా ఆసనాలూ వేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21 వ తేదీన యోగా కార్యక్రమం జరపడం చాలా సంతోషకరమని అన్నారు .ప్రస్తుతం […]

Continue Reading

గీతమ్ ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ‘ మానవత్వం కోసం యోగా ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు , అధ్యాపకులు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . తొలుత , గీతం హైదరాబాద్ రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ప్రసంగంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి . యోగా గురించి , రోజువారీ జీవితంలో యోగ సాధన చేయడం […]

Continue Reading

ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలి_కాట సుధా శ్రీనివాస్ గౌడ్

మనవార్తలు ,తెల్లాపూర్: ఓ పూట ఆకలి తీర్చొచ్చు. విద్యా దానం చేస్తే.. జ్ఞానం పంచొచ్చు. అదే రక్తదానం చేస్తే.. ప్రాణదాతలు కావొచ్చు. అందుకే అన్ని దానాలంటే కంటే రక్తదానం గొప్పదంటారు. రక్తదానం చేయండి చేయించండి అని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని ఆమె […]

Continue Reading

జిన్నారం లో 2 కోట్ల 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం..

_గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వామ్యం కావాలి _భూములు అమ్ముకోవద్దు..రైతులకు సూచన _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _ఎనిమిది లక్షల రూపాయల సొంత నిధులతో గ్రామపంచాయతీ కీ ఫర్నిచర్ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,జిన్నారం గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మండల కేంద్రమైన జిన్నారం లో 60 లక్షల రూపాయల హేట్రో సంస్థ సీఎస్ఆర్ నిధుల తో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం […]

Continue Reading

ఆర్ కె వై టీమ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకుఉపయోగపడే గొడుగులను ప్రత్యేకంగా తయారు చేయించిన ఆర్ కె వై టీమ్ సభ్యులు సమక్షంలో ఆదివారం రోజు శేరిలింగంపల్లి మాజి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ లు ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు పంచిపెట్టారు. సమాజ సేవ చేస్తున్న ఆర్ కె వై టీమ్ సబ్యులను అభినందించారు. ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. […]

Continue Reading