ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి…
– చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు:
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రకృతిని కాపాడి విరివిగా మొక్కలు పెంచడానికి కృషి చేయాలని పటాన్ చెరు మండలం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం సర్పంచ్ మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామ నాయకులంతా చిట్కుల్, ఇస్నాపూర్ రహదారికి ఇరువైపులా మొక్కలను నాటారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిట్కుల్ గ్రామాన్ని పచ్చదనంగా మార్చటానికి గ్రామస్తులంతా ఐక్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పచ్చదనంతోనే గ్రామస్థులు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణు వర్థన్ రెడ్డి, వార్డు సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
