పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మేరు కులస్తులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని కులస్తులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు బీరంగూడ గుట్టపైన వివిధ కుల సంఘాలకు 1000 గజాల చొప్పున స్థలం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మేరు కులస్తులకు తగు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. గతంలో టైలర్స్ అసోసియేషన్ సంఘానికి 450 గజాల స్థలాన్ని ఇంద్రేశంలో కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఇటీవల స్థలం విషయంలో టైలర్స్ అసోసియేషన్, మేరు సంఘాల మధ్య స్వల్ప వివాదం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రెండు సంఘాలకు 225 గజాల కేటాయిస్తానని తెలిపారు. మేరు సంఘానికి భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్, మేరు మండల కమిటీ. సలహాదారులు, మాజీ అధ్యక్షులు, యువజన సంఘం సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…