పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మేరు కులస్తులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని కులస్తులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు బీరంగూడ గుట్టపైన వివిధ కుల సంఘాలకు 1000 గజాల చొప్పున స్థలం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మేరు కులస్తులకు తగు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. గతంలో టైలర్స్ అసోసియేషన్ సంఘానికి 450 గజాల స్థలాన్ని ఇంద్రేశంలో కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఇటీవల స్థలం విషయంలో టైలర్స్ అసోసియేషన్, మేరు సంఘాల మధ్య స్వల్ప వివాదం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రెండు సంఘాలకు 225 గజాల కేటాయిస్తానని తెలిపారు. మేరు సంఘానికి భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్, మేరు మండల కమిటీ. సలహాదారులు, మాజీ అధ్యక్షులు, యువజన సంఘం సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…