Categories: politics

ప్రతి బస్తీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం – జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా అభివృద్ధికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు.మియపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి, బస్తి స్థానిక ప్రజలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని తెలిపారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఇళ్ల పట్టాలు ఇవ్వలేని యెడల సర్వె నంబర్ 100, 101లో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన లో భద్రత కల్పించాలని, మంజీర పైప్ లైన్ మరియు నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ సమస్యలను జగదీశ్వర్ గౌడ్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు..ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కోర్దినేటర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇలియస్ షరీఫ్, వీరేందర్ గౌడ్, సంజీవ రెడ్డి, మన్నెపల్లి సాంబశివరావు, ప్రతాప్ రెడ్డి, నడిమింటి కృష్ణ, శంకర్ గౌడ్ ,ప్రభాకర్ గౌడ్ , తుడుము అనిల్ కుమార్, రాములు, యాదగిరి, రవికుమార్ గౌడ్, గిరి, అసిఫ్, సుమన్, సురేష్, రాంబాబు, నరేందర్ ముదిరాజ్, బాలు, నవీన్, ప్రవీణ్, కుమార్ యాదవ్, ,శ్రీకాంత్, సత్యరాజ్, ,రాఘవేంద్ర, నర్సింహ, నరేష్, హరీష్, మహిళలు ప్రియదర్శిని, అనిత, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago