మనవార్తలు ,అమీన్పూర్:
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా ముందుండి నడుస్తూ తెలంగాణ సాధనలో బాగస్వాముడైన ఉద్యమకారుడు యువ న్యాయవాది సింగారం ఓం ప్రకాష్ బిఎస్పి పార్టీలో చేరారు.గురువారం అమీన్పూర్ నుండి 300 మందితో ర్యాలీగా బయలుదేరి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బిఎస్పీ కండువా కప్పుకున్నారు. సుల్తాన్పూర్ కు చెందిన టిఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి చిన్న గల్ల గిరి ఆ పార్టీకి రాజీనామా చేసి బిఎస్పి లో చేరారు
ఈ సందర్భంగ సింగారం ఓం ప్రకాష్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని మెచ్చి ప్రవీణ్ అడుగు జాడల్లో నడవాలని బీఎస్పీలో చేరుతున్నానని ఆయన అన్నారు. బలహీన వర్గాలు ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత తోనే బహుజన రాజ్యం సాధ్యమని నమ్మి రాజ్యాధికార దిశగా పయనిస్తున్న బీఎస్పీకి తన శక్తి మేరకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బహుజన రాజ్యాధికారం దిశగా అన్ని వర్గాల ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సతీష్ ,పటాన్చెరు అసెంబ్లీ ఇంచార్జ్ సంజీవ, పటాన్ చెరు అసెంబ్లీ అధ్యక్షుడు వినయ్, సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ జగదీష్, నాయకులు శ్రీశైలం, సుదర్శన్, రాములు, జనార్ధన్, బేగరి,రమేష్ శీను, రేణుక, నవనీత బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…