పాశమైలారం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో గురువారం సాయంత్రం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ మోటే కృష్ణ ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. పోతురాజుల నృత్య విన్యాసాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Continue Reading