Telangana

భావవ్యక్తీకరణపైనే విజయం ఆధారపడి ఉంటుంది

-జర్నలిజంపై హిందూ బిజినెస్ లైన్ పూర్వ అసోసియేట్ ఎడిటర్ సోమశేఖర్ వ్యాఖ్య

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

జర్నలిజంలో విజయం సాధించాలంటే భావవ్యక్తీకరణ, ప్రేక్షకులను కట్టిపడేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని హిందూ బిజినెస్ లైన్ పూర్వ అసోసియేట్ ఎడిటర్, బ్యూరో చీఫ్ సోమశేఖర్ ములుగు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎహెచ్ఎస్)లోని మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్  విభాగం ‘జర్నలిజంలో మార్గదర్శనం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజా ప్రయోజనాలు అనే అంశంపై సోమవారం అతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.జర్నలిజం ఐదు దశల గురించి (1950-90 ప్రతికలు, రేడియో: ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో 1991 నుంచి ఫెనాన్షియల్ న్యూస్ పేపర్ల్ ఆగమనం: గూగుల్ సృద్ధితో 2000 నుంచి డిజిటల్ మీడియా: 2010-20 సోషల్ మీడియా నిబృంభణ: ఇక కోనిడ్ నేపథ్యం, కృత్రిమ మేథల సాయంతో వర్తమాన పాత్రికేయం), సాంకేతిక పురోగతితో పరిశ్రమ, పాత్రికేయం ఎలా రూపాంతరం చెందాయో సోమశేఖర్ వివరించారు. ప్రారంభ దశంలో సంప్రదాయ వార్తాపత్రికలు, రేడియో నుంచి ఇటీవలి డిజిటల్ మీడియా, సామాజిక వేదికల అనిర్భావం వరకు, మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిజం నిరంతరం అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.

జర్నలిజంలో మంచి రచన, మాట్లాడే నైపుణ్యాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన సోమశేఖర్, కంటెంట్ రెటింగ్, ఫ్రీలాన్స్ అవకాశాలను అన్వేషించాలని ఔత్సాహిక పాత్రికేయులను ప్రోత్సహించారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల పెరుగుదలను ప్రస్తావిస్తూ, ఇక్కడ ఆయా వ్యక్తులు తను ప్రతిభను ప్రదర్శించవచ్చని, తాము అనుకున్నది ఎటువంటి పరిమితులు లేదా నిబంధనల చట్రం వంటివి లేకుండా చెప్పొచ్చని, సొంత ప్రేక్షకులు / వీక్షకులను పొందవచ్చని చెప్పారు.వర్ధమాన జర్నలిస్టులు తమ నెపుణ్యం ఆధారంగా మీడియాను ఎంచుకోవాలని, మంచి కథనం, దానిని ఆకట్టుకునేలా చెప్పగలిగే సామర్ధ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని సోమశేఖర్ సూచించారు.తొలుత, జీఎహెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ అతిథిని స్వాగతించారు, మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గడగమ్మ బాలకృష్ణ సోమశేఖర్ ను సత్కరించగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గామన్ పాలెం వందన సమర్పణ చేశారు. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను అడిగి, నివృత్తి చేసుకున్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago