Telangana

నాగార్జున ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థుల సందడి

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం, దర్గా నాగార్జున ‘పాఠశాలలో గురువారం రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థుoలందరూ గోపికలు, కృష్ణుల వేషధారణలో పాఠశాల (ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. చిన్ని చిన్ని విద్యార్థులందరూ వారి మాటలు, డాన్స్లతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మెప్పించారు. తర్వాత చక్కని వేషధారణలతో అలరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కొంతమంది విద్యార్థులు శ్రీకృష్ణాష్టమి గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాఠశాల కరస్పాండెంట్ భరత్ కుమార్ కృష్ణాష్టమి గురించి, శ్రీ కృష్ణుని లీలల గురించి పిల్లలకు తెలియజేశారు. చివరిగా విద్యార్థులచే ఉట్టి కొట్టించి, కోలాటలు ఆడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఛైర్మన్ కృష్ణ గౌడ్, ప్రిన్సిపల్ సుంధరి, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

నార్సింగ్ బ్రాంచ్ లో…..

నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్ శారదా విద్యా నికేతన్ లో గురువారం రోజున శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించగా కౌన్సిలర్ ఉషారాణి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్ లు ముఖ్య అతిధులు గా విచ్చేశారు.శ్రీకృష్ణాష్టమి వేడుకల్లు ప్రీ ప్రైమరీ విద్యార్ధులు కృష్ణ, రాధా, గోపిక వేషధారణ లో అందoగా ముస్తాబై బృందావనాన్ని తలపించారు. చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, నృత్యాభినయం కార్యక్రమాల్లో పాల్గొని అందరిని అలరించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు చేసిన నృత్య ప్రదర్శనలు తల్లితండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ఉషారాణి మాట్లాడుతూ పాఠాశాలలో ప్రతీ పండుగను నిర్వహించడం ద్వారా మన సంస్కృతి భావి తరాలకు తెలుస్తుందని, తనకు ఈ వేడుక చూస్తే బృందావనం గుర్తుకు వచ్చిందని ఆనందం వ్యక్తం చేసారు. ఇలాంటి స్కూల్ ఉండటం తనకు గర్వకారణం అని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు. కరస్పాండెంట్ పూర్ణిమా భరత్ కుమార్ కార్యక్రమానికి విచ్చేసిన తల్లితండ్రులకు విద్యార్ధులకు శ్రీ కృష్ణాష్టమి విశిష్టతను శ్రీ కృష్ణుడి జీవితం లో ఘట్టాలను వివరించి, విద్యార్ధులు స్ఫూర్తి పొందాలని సూచించారు. అశోక్ యాదవ్ మాట్లాడుతూ పాఠాశాలలో ఇలాంటి కార్యక్రమాలు చెయ్యడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తను పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. అందoగా అలంకరించిన ఉట్టి ని ఉత్సాహంగా కొట్టి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో ఆశ్రిత సంప్రదాయబద్దంగా శ్రీ కృష్ణుడికి వెండి గిన్నెలలో వెన్నను సమర్పించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago