Telangana

పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక

_రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు.. నిధుల కేటాయింపు 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

దేశంలోనే మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు, మైనార్టీ బంధు, బి సి బందు, గృహలక్ష్మి పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇందులో ఎలాంటి సిఫార్సులకు తావులేదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం పటాన్చెరు ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించాలని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ మొట్టమొదటిసారిగా దళిత బంధు గృహలక్ష్మి మైనార్టీ బందు బీసీ బందు లాంటి విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఇంటింటి విచారణ తర్వాతే లబ్ధిదారు ఎంపిక చేయడం జరిగిందని గుర్తు చేశారు.

పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారని తిరిగి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడతారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కాదని.. చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా మిగులుతాయని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. శరవేగంగా విస్తరిస్తున్న పటాన్చెరు నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామని తెలిపారు.అంగన్వాడి ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వేతనాలు పెంచుతూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారని తెలిపారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్లు వెంటనే విరమించి విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడి పాఠశాలలకు తాళాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల వినియోగం రోజురోజుకు పెరుగుతోందని, సంబంధిత ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పటాన్చెరు జాతీయ రహదారి నుండి పెద్దకంచెర్ల మీదుగా దౌల్తాబాద్ బ్రిడ్జి వరకు 18 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన స్పోర్ట్స్ కిట్లను అతి త్వరలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీడీవో బన్సీలాల్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago