మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో – ఆర్డినేటర్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటిలో పాల్గొన్న విజేతలకు పాశమైలారం మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ముగ్గుల పోటీలలో పాల్గొని సృజనాత్మకతను చూపించడం అభినందనీయమన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన శ్రామిక సంక్షేమ కేంద్రం బాధ్యులను అభినందించారు.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమవంతు సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రామిక సంక్షేమ కేంద్రం కో ఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ శ్రామిక ప్రజల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అందరి సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రామిక సంక్షేమ కేంద్రం బాధ్యులు వెంకటేష్, చంద్రయ్య, ఈశ్వరరావు, ప్రభు, అనాజీ, రమేష్, శ్రీను, యకమ్మ, దేవి, హేమ,సువర్ణ, హారిక, మాదవి, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…