దేవాలయం నిర్మాణానికి రూ:5 లక్షలు అందజేత…
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
కంది(సంగారెడ్డి జిల్లా):
సంగారెడ్డి జిల్లా కంది మండలం లోని చేర్యాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ ఆలయాన్ని ఆదివారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించామ .ఈ సందర్భంగా ఆలయ భవనం నిర్మాణానికి గాను తనవంతుగా రూ 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, నాగభూషణం మాట్లాడుతూ గ్రామంలోని రామాలయ నిర్మాణానికి అందరి సహకారాన్ని తీసుకుంటున్నామని అన్నారు.
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నీ తాము కలిసి ఆలయ అభివృద్ధి ,భవన నిర్మాణానికి సహకరించాలని కోరడంతో నేడు ఆలయాన్ని సందర్శించి తనవంతుగా ఐదు లక్షలు అందజేశారని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం లోనే కాకుండా పక్కనే ఉన్న సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా తమ స్వగ్రామం లోని ఆలయానికి కోరిన వెంటనే ధనసహాయం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్, గ్రామ సర్పంచ్ ప్రవీణ్, నాయకులు చంద్రారెడ్డి, ప్రభాకర్, రాములు, శంకర్, శ్రీధర్ ,హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…