దేవాలయం నిర్మాణానికి రూ:5 లక్షలు అందజేత…
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
కంది(సంగారెడ్డి జిల్లా):
సంగారెడ్డి జిల్లా కంది మండలం లోని చేర్యాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ ఆలయాన్ని ఆదివారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించామ .ఈ సందర్భంగా ఆలయ భవనం నిర్మాణానికి గాను తనవంతుగా రూ 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, నాగభూషణం మాట్లాడుతూ గ్రామంలోని రామాలయ నిర్మాణానికి అందరి సహకారాన్ని తీసుకుంటున్నామని అన్నారు.
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నీ తాము కలిసి ఆలయ అభివృద్ధి ,భవన నిర్మాణానికి సహకరించాలని కోరడంతో నేడు ఆలయాన్ని సందర్శించి తనవంతుగా ఐదు లక్షలు అందజేశారని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం లోనే కాకుండా పక్కనే ఉన్న సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా తమ స్వగ్రామం లోని ఆలయానికి కోరిన వెంటనే ధనసహాయం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్, గ్రామ సర్పంచ్ ప్రవీణ్, నాయకులు చంద్రారెడ్డి, ప్రభాకర్, రాములు, శంకర్, శ్రీధర్ ,హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…