పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధన ఆవశ్యకత పెరిగిందని, శోధనే పురోగతికి మైలురాయిగా మారిందని అను స్పెక్ట్రా కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు, డైరక్టర్ డాక్టర్ అనుప్రీత్ శర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘నర్చరింగ్ రీసెర్చ్’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమలలో విద్య, పరిశోధనా అవకాశాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. చాలా ఫార్మా ఉద్యోగాలకు వ్యక్తులు బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్ డీ వరకు నిర్దిష్ట స్థాయి అర్హత, పరిశోధనా ఉత్సాహాన్ని కలిగి ఉండాలన్నారు. ఫార్యాస్యూటికల్ రంగంలో ఒక బలమైన పరిశోధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి తన ఉపన్యాసం ఎంతో దోహదపడుతుందంటూ, సపేరే- ఆడే అంటే డేరింగ్ టు కాన్సెప్ట్ గురించి ప్రసంగించారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులను ప్రోత్సహించడానికి, నిగూఢమైన పరిశోధనా ప్రపంచంలోని రహస్యాలను ఛేదించడంలో తనవంతు తోడ్పాటునందించారు. పరిశోధనలకు విద్య, నైతికల , నెతిక విలువల బలమైన పునాది అవసరమని, ఇవన్నీ గీతం వంటి విద్యా సంస్థల కోర్సుల బోధనా సమయంలోనే పెంపొందిస్తారని చెప్పారు. విద్యార్థుల ప్రశ్నలకు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శివకుమార్, అతిథికి ఘన స్వాగతం పలికి, విద్యార్థులు, అధ్యాపకులతో ఆయన విశేష అనుభవాలను పంచుకున్నందుకు సత్కరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గటడి శ్రీకాంత్ వందన సమర్పణతో ఈ ఉపన్యాస కార్యక్రమం ముగిసింది.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…