ప్రాణాలు లెక్కచేయకుండా కాపాడుతున్న పోలీసులు వందలో ఒక్కరే ఉంటారు

Andhra Pradesh Crime Districts

తూర్పుగోదావరి జిల్లా

తల్లి తన కొడుకు, కూతురుతో పోలవరం కాలువలో ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు, ఎస్ ఐ ఎస్ లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని వారి యొక్క ప్రాణాలకు తెగించి కాలువలో దూకిన బాధితులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు పీకల్లోతు నీటిలో మునిగిపోయారు. అదృష్టవశాత్తు సీఐ సురేష్ బాబుకు పెనుప్రమాదం తప్పింది. కాలువలో దూకిన బాలుడు తల్లిని వెలికితీసిన పోలీసులు. ప్రస్తుతం బాలుడు సృహ లో ఉన్నాడు తల్లి మాట్లాడే పరిస్థితిలో లేదు. ఇంకా కూతురు ఉండి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏదేమైనా నా ప్రాణాలకు తెగించి, ధైర్య సాహసాలు చేసి పీకల లోతు నీటిలో మునిగి బాధితులను రక్షించిన సీఐ సురేష్ బాబు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *