politics

పటాన్ చెరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

_చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు:

రైతాంగం పండించిన చివరి వరి ధాన్యం గింజ కొనుగోలు చేసేంత వరకు కొనుగోలు కేంద్రాలు పని చేస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండల ముత్తంగి, లక్డారం, పటాన్చెరు పిఎసిఎస్ పరిధిలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయని అన్నారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రతి ఒక్కరు ఎండగట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు ఉపేందర్, సువర్ణ మాణిక్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

20 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

22 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago