తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అభివృధి శూన్యమని, కేసీఆర్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర ప్రచార కమిటి అధ్యక్షులు కొత్త బస్వరాజ్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు అసంతృప్తికి గురవుతున్నారని తెలిపారు. అంతే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చకపోగా, రోజు రోజుకు కొత్త హమీలిస్తు ప్రజలను అమాయకులను చేసి మానసిక స్థితులతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఏమయ్యాయి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంలో జ్యప్యం ఎందుకు అని ప్రశ్నించారు.
రైతు రుణ మాఫీ చెయ్యకపోవడంలో అర్థం ఏమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్న సమస్యలు రోజంతా చెప్పిన మిగులుతాయని పేర్కొన్నారు. ఇన్ని సమస్యల వల్ల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండక ఎలా ఉంటారని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ భూములను బేరం పెట్టడం అంటే ఆ రాష్ట్రం త్వరలో దివాలా తీస్తుందని, ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను చూస్తేనే ఈ ప్రభుత్వం పని తీరు ఏమిటో అర్థం అవుతుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన విధంగా పరిపాలన జరపాలని అన్నారు. లేదంటే అతి త్వరలో గద్దె దిగే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…