Telangana

గీతం అధ్యాపకుడు మరియదాసు మత్తేకు పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ మరియదాసు మత్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్ డీ) పట్టాను పొందారు. కాకినాడలోని జేఎన్ టీయూ విశ్వవిద్యాలయం దీనిని ప్రదానం చేసింది.‘కన్వల్యూషనల్ న్యూరల్ నెట్ వర్క్ లను ఉపయోగించి ఈఈజీ సిగ్నల్ లలో ఆర్టిఫ్యాక్ట్ తొలగించే పద్ధతుల అమలు’ అనే అంశంపై మరియదాసు పరిశోధన చేసి, సిద్ధాంత వ్యాసం సమర్పించారు. విజయవాడలోని వీ.ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.పద్మజ, జేఎన్ టీయూ కాకినాడ (అటానమస్) విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ ప్రొఫెసర్ డాక్టర్ బీ.టీ.కృష్ణల మార్గదర్శనంలో ఈ పరిశోధన జరిగింది.ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (ఈఈజీ) అనేది న్యూరోసైన్స్ లో ఒక ముఖ్యమైన సాధనం. ఇది మెదడు కార్యకలాపాలను నమోదు చేయడానికి, నాడీ సంబంధిత రుగ్మతలను నిర్ధారించడానికి, చికిత్స చేయడంతో సహాయ పడుతుంది. మరియదాసు పరిశోధన ఈఈజీ సిగ్నల్స్ నుంచి ఆర్టిఫ్యాక్ట్ ను స్వయంచాలకంగా తొలగించడానికి అత్యాధునిక లోతైన విధానాన్ని అందిస్తుంది. ఇది నాడీ సంబంధిత అంచనాల ఖచ్చితత్వాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన దశ.గీతం మ్యాట్ ల్యాబ్ లోని అత్యాధునిక పరికరాలను ఉపయోగించి మరియదాసు చేపట్టిన ఈ పరిశోధనాంశాలు నాలుగు ప్రసిద్ధ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.మరియదాసు పీహెచ్.డీ. పట్టాను సాధించి, ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నందుకు గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రంగానికి మరియదాసు చేసిన సేవలను ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

15 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

15 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago