* అంగడిపేట లో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
* పండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి మండలం అంగడిపేట గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అంగడిపేట గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు . ఆలయ ఇన్చార్జ్ చోట్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు మధును సాదరంగా ఆహ్వానించి, వేద మంత్రోచరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నీలం మధును శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ తనపై ఉండాలని భగవంతుడి దయవల్ల రాష్ట్రం లోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ,స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జ్ శ్రీనివాస్, కమిటీ సభ్యులతో పాటు ఎంపీపీ లావణ్య, తనయుడు సాయి, చాపల విశ్వనాథం, గుమ్మడిదల జగన్ తదితరులు పాల్గొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…