* అంగడిపేట లో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
* పండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి మండలం అంగడిపేట గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అంగడిపేట గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు . ఆలయ ఇన్చార్జ్ చోట్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు మధును సాదరంగా ఆహ్వానించి, వేద మంత్రోచరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నీలం మధును శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ తనపై ఉండాలని భగవంతుడి దయవల్ల రాష్ట్రం లోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ,స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జ్ శ్రీనివాస్, కమిటీ సభ్యులతో పాటు ఎంపీపీ లావణ్య, తనయుడు సాయి, చాపల విశ్వనాథం, గుమ్మడిదల జగన్ తదితరులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…