పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ముగ్గులకు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం మండల పరిధిలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీలో సీనియర్ నాయకులు ఆబేద్, మేరాజ్ ఖాన్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మహిళల కోసం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పండగ విశిష్టతను ప్రతిబింబించేలా ముగ్గులు వేయడం పట్ల ఆయన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోటీలలో పాల్గొన్న 126 మంది మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రామకృష్ణ, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…