అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులకు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ తల్లి, శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తమ సంప్రదాయ పరిధిలో గొంగడిని కప్పి సన్మానించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ కుర్మ నర్సమ్మ, మాజీ ఎంపీటీసీ పట్నం రాజు, సీనియర్ నాయకులు నగేష్, తులసి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…