పటాన్చెరు
వినాయక చవితినీ పురస్కరించుకొని ప్రసిద్ధ రుద్రారం సిద్ధి గణపతి వినాయకుడిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఎంపిటిసి రాజు, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, దంపతులు, గుడెం కల్పన మధుసూదన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…