Telangana

ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_గడపగడపకు సంక్షేమ పథకాలు..

_పటాన్చెరు గడ్డ..బిఆర్ఎస్ అడ్డ..

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గడప గడపకు సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి పల్లెను ప్రగతికి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కైవసం చేసుకుంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 60 ఏళ్లలో సాధించని ప్రగతిని 10 ఏళ్లలో చేసి చూపించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి పల్లెను ప్రగతికి ప్రతిరూపంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు జిమ్మిక్కులు చేసిన టిఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేరని అన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాకున్నా తెలంగాణలో అమలు చేస్తామంటూ ప్రగాల్బాలు పలకడం ప్రతిపక్షాలకే చెల్లిందని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయని నమోదు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago