పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
మెరుగెన జీవనం కోసం ప్రజలు వలస వెళుతుంటారని , దాదాపు 4.5 కోట్ల మంది భారతీయులు దేశంలో సంచార జీవనం గడుపుతున్నట్టు ఉంటారని ఖతార్లోని జార్జిటౌన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ చంద్ర అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘ విదేశీయులు , సంచార వలసదారులు : భారతదేశంలో మానవ చలనశీలత యొక్క సామాజికశాస్త్రం ‘ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర గ్రామాలకు , గ్రామాల నుంచి పట్టణాలకు , ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వంటి మూడు రకాల మానవ చలనశీలతలు ఉన్నట్టు ఆయన చెప్పారు . మెజారిటీ వలసదారులు భారతదేశం అంతటా సంపన్న పట్టణ ప్రాంతాలలో ఉపాధి పొందుతున్నారని , అందులో అత్యధిక శాతం మంది అనధికారిక ఆర్థిక వ్యవస్థలో , అనిశ్చిత పరిస్థితులలో , తక్కువ ఉద్యోగ భద్రతతో పనిచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు .
మానవ చలనశీలత చారిత్రక నేపథ్యాలను ఆయన వివరిస్తూ , కాలానుగుణంగా , వాతావరణ మార్పులను బట్టి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వలస వెళుతుంటారన్నారు . కొండ ప్రాంత ప్రజలు అననుకూల వాతావరణ పరిస్థితులలో మెదైన ప్రాంతానికి వస్తుంటారని , అలాగే స్థానికంగా ఉపాధి లభించనప్పుడు పట్టణ ప్రాంతాలకు వెళతారని , మళ్లీ స్థానికంగా పని లభించేటప్పుడు వారంతా తిరిగొస్తారని చెప్పారు . వలసల ఆర్థిక సిద్ధాంతాలు మానవ చలనశీలత యొక్క సామాజిక సాంస్కృతి తర్కాన్ని పట్టుకోలేవని ఆయన స్పష్టీకరించారు . విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…