Telangana

మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలి _మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మెట్రోరైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు పొడిగింపు పై నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ,మెట్రోరైల్ సాధన సమితి ముఖ్యనాయకుల విస్తృత స్థాయి సమావేశం పటాన్ చెరు లో నిర్వహించారు ఈ సంధర్భంగా మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న మాట్లాడుతూ మెట్రో సాధన సమితి ప్రధాన డిమాండ్ మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలని , గత ప్రభుత్వం మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు పొడగించారని , ఆర్ సి పురం వరకు మాత్రమే పొడిగింపు పరిమితం చేయొద్దని ,పఠాన్ చెరు మండలం ఇస్నాపూర్ వరకు రెండో దశలోనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం రోజురోజుకీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మెట్రో లైన్ ఇస్నాపూర్ వరకు కచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉందని సత్తన్న తెలిపారు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని అయన గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో మెట్రో లైన్ మార్గాన్ని కుదించవద్దని కోరారు. నిత్యం వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని మెట్రో సర్వీసు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యలు తగ్గుతాయని సత్తన్న తెలిపారు అదే విధంగా ఓఅర్ఆర్ శివారు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రెండో దశలో మియాపూర్ – ఇస్నాపూర్ మార్గ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. ఇదే అంశం పై త్వరలో ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ ఈర్ల రాజు మెట్టుశ్రీధర్ చవ్వ రమేష్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

4 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

4 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

1 day ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

1 day ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

2 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

2 days ago