Telangana

మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలి _మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మెట్రోరైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు పొడిగింపు పై నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ,మెట్రోరైల్ సాధన సమితి ముఖ్యనాయకుల విస్తృత స్థాయి సమావేశం పటాన్ చెరు లో నిర్వహించారు ఈ సంధర్భంగా మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న మాట్లాడుతూ మెట్రో సాధన సమితి ప్రధాన డిమాండ్ మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలని , గత ప్రభుత్వం మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు పొడగించారని , ఆర్ సి పురం వరకు మాత్రమే పొడిగింపు పరిమితం చేయొద్దని ,పఠాన్ చెరు మండలం ఇస్నాపూర్ వరకు రెండో దశలోనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం రోజురోజుకీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మెట్రో లైన్ ఇస్నాపూర్ వరకు కచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉందని సత్తన్న తెలిపారు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని అయన గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో మెట్రో లైన్ మార్గాన్ని కుదించవద్దని కోరారు. నిత్యం వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని మెట్రో సర్వీసు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యలు తగ్గుతాయని సత్తన్న తెలిపారు అదే విధంగా ఓఅర్ఆర్ శివారు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రెండో దశలో మియాపూర్ – ఇస్నాపూర్ మార్గ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. ఇదే అంశం పై త్వరలో ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ ఈర్ల రాజు మెట్టుశ్రీధర్ చవ్వ రమేష్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago