పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెదక్ పార్లమెంటు నుంచి పోటీలో ఉన్న బిజెపి, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ కూడా దొంగలేనని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జ్ కొండా సురేఖ అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులని ఎంపీ ఎన్నికలలో గెలిపించాల్సిన అవసరం ఉన్నదా? అని ప్రశ్నించారు. పటాన్చెరు పరిధి రామచంద్రపురం లోని శ్రీ కన్వెన్షన్ హాలులో బుధవారం ఎన్ఎస్ యు ఐ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నిక సన్నాహక సమావేశం ఎన్ఎస్ యు ఐ రవీందర్ గౌడ్ అధ్యక్షతన బుధువారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా కొండా సురేఖ హాజరయ్య్యారు .ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెంకట్రామిరెడ్డి ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడి, పేదల పొట్టలు కొట్టాడని . కేసిఆర్ పాలనలో వెంకట్రామిరెడ్డి కోట్ల రూపాయలు దండుకున్నాడని, కేవలం వారి నేతలకు, నాయకులకు మాత్రమే పథకాలు పనులు లాంటివి చేసి దుర్మార్గపు రాక్షస పాలన బిఆర్ఎస్ కొనసాగించిందని ఆరోపించారు. నాడు అసలైన తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులను కాదని,వేరే వ్యక్తులకు బిఆర్ఎస్ అన్నింట్లో అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
రెండోసారి కూడా ఈ తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కు పట్టం కడితే, వారిలో ఎటువంటి మార్పులు రాలేదని, ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని , అసెంబ్లీ కి రానటువంటి మాజీ సీఎంకేసీఆర్ ఎన్నికలు రావడంతోనే బయటకు వచ్చారని ఆరోపించారు. సామాన్యుల ఫైళ్లను టేబుల్ ఫైళ్లను పక్కన పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ కేవలం మేడిగడ్డ మిషన్ భగీరథ వంటి ఫైళ్ళ పైనే సంతకాలను చేస్తూ పరిపాలన కొనసాగించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గత పాలకులు చేయనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారెంటీ ల అమలుపై హరీష్ రావు, కేటీఆర్ నిందిస్తున్నారని, వారికి ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలను ఇంటింటికి తీసుకుపోయి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులకు సురేఖ సూచించారు. అలాగే ఈ ఎంపీ ఎన్నికలే నాయకుల భవిష్యత్తును డిక్లేర్ చేస్తాయని కూడా పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులు కార్యకర్తలను ఆమె కోరారు.
గత పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోయి ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని పటాన్చెరువు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బిజెపి మతోన్మాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుందని, ఆయన శక్తులకు కాంగ్రెస్ నాయకులు తిప్పి కొట్టాలన్నారు. సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లో చిచ్చుపట్టేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాగైతే ముందుకు వెళ్ళామో? ఈ ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపునకు కృషి చేయాలని సూచించారు.
ఎంపీ ఎన్నికలలో తనను గెలిపిస్తే ఈ మెదక్ ప్రాంత అభివృద్ధి పదంలో తీసుకెళ్లి, రుణం తీర్చుకుంటానని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఒకనాడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇందిరమ్మ ప్రధాని అయి ఈ ప్రాంతానికి ఎంతో చేశారని అన్నారు. బీడీఎల్ , బిహెచ్ఎల్ తోపాటు అనేక కర్మాగారాలు ఇతరత్రా మౌలిక వసతులను ఇందిరాగాంధీ కల్పించి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ప్రస్తుతానికి బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఎవరికి సహాయం అందించినది లేదన్నారు.కలెక్టర్ గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి మానవత్వం చూపకుండా కనీసం ఎవరికి టైం ఇచ్చేవాదు కాదన్నారు. తాను ఈ ప్రాంతంలో ఎవరైనా కష్ట సుఖాలలో ఉండి తన తలుపు తడిపిన వారందరికో సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.బిఆర్ఎస్,బిజెపి అభ్యర్థులు గెలిస్తే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారని, తనను గెలిపిస్తే ప్రజల్లోనే ఉండి సేవ చేస్తానని ఈ సందర్భంగా నీలం మధు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిస్టిక్ ఐఎన్ టియుసి ప్రెసిడెంట్ కొల్ల్కూరి నరసింహారెడ్డి, అసెంబ్లీ ఇంచార్జ్ వినయ్ గౌడ్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ రవీందర్ గౌడ్,బొల్లారం మున్సిపల్ చైర్మన్ అంతిరెడ్డి గారి అనిల్ కుమార్,పీసీసీ మెంబర్లు, బ్లాక్ కాంగ్రెస్, మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి,నాయకులు శ్రీశైలం,రవీందర్,నారాయణ రెడ్డి, ఎన్ఎస్ యుఐ సభ్యులు ,యూత్ కాంగ్రెస్ సభ్యులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…