– మెరుగైన వేతన ఒప్పందం సిఇటియు కే సాధ్యం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కార్మికుల కష్టసుఖాల్లో వెన్నంటు ఉండే సిఐటియునే గెలిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ పెన్నార్ కార్మికులకు పిలుపునిచ్చారు.పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం రాత్రి జరిగిన పెన్నార్ పరిశ్రమ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇస్నాపూర్ ఎంపీటీసీ సభ్యులు గడ్డం శ్రీశైలం లు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్నార్ పరిశ్రమలో బిఆర్ టీయు అధికార గుర్తింపుగా యూనియన్ గా ఉండి ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని, వేతన ఒప్పందాన్ని మోసం చేసిందని, దగా చేసిందని వారు విమర్శించారు. పరిశ్రమలో కార్మికులకు వేధింపుల తో పాటు మెమోలు ఎక్కువైనాయని ఆరోపించారు , క్యాంటీన్ రేట్లు పెంచారని, కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారానికి నోచుకోకపోవడం దారుణం అన్నారు, కార్మికుల సమస్యల మీద అవగాహన ఉన్న సంఘం సీఐటీ యు నేనని పెన్నర్ పరిశ్రమంలో మంచి వేతన ఒప్పందం, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సీఐటీయూ నే గెలిపించాలని కార్మికులందరిని ఈ సందర్భంగా వారు కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి మల్లేష్, ఉపాధ్యక్షులు కే రాజయ్య, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు, పెన్నార్ పరిశ్రమ నాయకులు శేషగిరి, త్రిమూర్తులు, రాజు, జయ కుమార్, పాండురంగారెడ్డి, ఐ ఎన్ టి సి నాయకులు రెహమాన్, శివపాల్
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…