కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేర‌నున్న‌ ఎల్.ర‌మ‌ణ…

Hyderabad

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేర‌నున్న‌ ఎల్.ర‌మ‌ణ…
-16న హుజూరాబాద్ సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా
-ఇటీవలే కేసీఆర్ ను కలిసిన అనంతరం టీడీపీకి రాజీనామా

హైదరాబాద్:

టీడీపీ తెలంగాణ‌ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన ఎల్.రమణ ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సాదాసీదాగా వెళ్లి ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయ‌న‌కు స‌భ్య‌త్వం ఇచ్చిన కేటీఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు టీఆర్ఎస్ నేత‌లు పాల్గొన్నారు.

కేసీఆర్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తోపాటు వెళ్లి కలిశారు . ఆ సందరభంగా ముఖ్యమంత్రి పార్టీలోకి ఆహ్వానించడం , ఆయన అందుకు సమ్మతి తెలపడం జరిగిపోయాయి.

ఎల్‌.ర‌మ‌ణ‌తో పాటు ప‌లు సంఘాల నేత‌లు, ఆయ‌న‌ మ‌ద్ద‌తుదారులు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. పార్టీ మార‌డంపై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవ‌ల‌ ర‌మ‌ణ చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.ర‌మ‌ణ ఆ పార్టీలో త‌న ప్ర‌స్థానాన్ని ముగించారు.
కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరినప్పటికీ ఈనెల 16న హుజూరాబాద్ లో జరిగే ముఖ్యమంత్రి సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. రమణతోపాటు మరికొందరు ,టీడీపీ నేతలు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది.

రమణ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తొలుత ఈ వార్తలను ఖండించిన ఆయన గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తన ఎదుగుదలకు 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు అందులో హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *