పటాన్ చెరు:
పరిమిత మూలకం పద్ధతిలో తాత్కాలికమాగ్నటోహెడ్రోడెన్షమిక్స్ ప్రవాహ సమస్యలపై థర్మల్ డిఫ్యూజన్ , డిఫ్యూజన్ థర్మో ఎఫెక్ట్స్్ప అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మాథమెడిక్స్ విభాగం పరిశోధక విద్యార్థి ఎస్.జయప్రసాదు డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెని గణితశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివారెడ్డి శేరి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .
తాత్కాలిక మాగ్నెటో హెడ్రోడెనమిక్స్ ( ఎంహెచ్ఐ ) ప్రవాహ సమస్యలపై థర్మల్ డిఫ్యూజన్ , డిఫ్యూజన్ థర్మో ఎఫెక్ట్ ప్రభావాలపై ఈ పరిశోధన దృష్టి సారించినట్టు తెలిపారు . పాలక సమీకరణాలు గాలెర్కిన్ ఫినిట్ ఎలిమెంట్ మెథడ్ ద్వారా పరిష్కరించామన్నారు . ప్రవాహ సమస్యలు తగిన పరివర్తనతో పరిమాణం లేనివిగా మార్చొచ్చని చెప్పారు . వేగం , ఉష్ణోగ్రత , ఏకాగ్రతపై వివిధ రకాల పారామితుల కోసం సంఖ్యాపరమైన పరిష్కారాలను పరిశీలించామన్నారు .
ప్రస్తుత శోధనాంశాలను గతంలో ప్రచురించిన సంఖ్యా ఫలితాలతో పోల్చి పరిమిత మూలకం పరిష్కారాలను ధృవీకరించినట్టు తెలియజేశారు . జయప్రసాద్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రేజా , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…