_పటాన్చెరులో ఘనంగా బసవ జయంతి
_త్వరలో బీరంగూడ లో బసవేశ్వర కాంస్య విగ్రహ ఏర్పాటు
మనవార్తలు ,పటాన్ చెరు
12వ శతాబ్దం లోనే కుల మత వర్గ రహిత సమాజం కోసం అనుభవ మంటపం ఏర్పాటుచేసిన గొప్ప అభ్యుదయ వాది, విశ్వ గురు మహాత్మా బసవేశ్వరుడు అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బసవేశ్వరుడి 889 వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని అశ్వారూఢ బసవేశ్వరుని విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీరంగూడ కమాన్ వద్ద 20 లక్షల రూపాయల వ్యయంతో అశ్వారూఢ బసవేశ్వరుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో లింగాయత్ సమాజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాయకమే కైలాసం, దేహమే దేవాలయం, భక్తి కన్నా సత్ప్రవర్తన ముఖ్యం అంటూ చేసిన బోధనలు నేటి తరానికి అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసవేశ్వర్, విజయ్ కుమార్, చంద్ర శేకర్ రెడ్డి, లింగాయత్ సమాజం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…