రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాశివరాత్రి సందర్భంగా నందవరం మండలం గురజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో దర్శించుకుని హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పూలతో అందగా ముస్తాబు చేసిన రథంలో రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఊరేగించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వరుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ శాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్ని వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, టిడిపి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…